
కాంగ్రెస్లో రెండు వర్గాల మధ్య తోపులాట
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు వ్యతిరేకంగా నాయకులు నగరంలోని ఐఎంఎ హాలులో సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించంగా షర్మిల వర్గీయులు సమావేశం లోపలికి వచ్చి షర్మిల నాయక త్వం వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో రాహుల్ గాంధీ నాయకత్వం వర్థిల్లాలి అంటూ మరో వర్గం వారు నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీంతో నాయకుల మధ్య మాటామాటా పెరిగి కుర్చీలతో కొట్టుకునే వరకు వెళ్లింది. షర్మిల వర్గీయులు సుంకర పద్మశ్రీని అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు సుంకర పద్మశ్రీని సురక్షితంగా పంపించారు.