
కేటాయించిన లక్ష్యం అధిగమిద్దాం
కడప అగ్రికల్చర్ : జిల్లాలో కంపెనీలకు కేటాయించిన బిందు, తుంపర సేద్యం లక్ష్యాలను పూర్తి చేసేందుకు కృషిచేయాలని ఏపీ సూక్ష్మనీటి సాగు పథకం జిల్లా అధికారి వెంకటేశ్వరరెడ్డి సూచించారు.కడప ఏపీఎంఐపీ కార్యాలయంలో వివిధ కంపెనీల సిబ్బందికి మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి 15వేల హెక్టార్లలో బిందు, తుంపర సేద్య పథకం అమలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారన్నారు. ఐదెకరాల పొలం కలిగిన ఎస్సీ, ఎస్టీలకు వందశాతం, పదెకరాలు కలిగిన రైతులకు 90 శాతం, 12.5 ఎకరాలున్న రైతులకు 50 శాతం రాయితీ ఉంటుందన్నారు. అర్హులైన రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ మురళీమోహన్రెడ్డి, ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.