
స్టీల్ప్లాంట్ నిర్మాణంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం
మైలవరం : కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం విషయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ విమర్శించారు. 2019 జనవరిలో మండల పరిధిలోని కంబాలదిన్నె గ్రామం వద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు.
ఈ ప్రాంతాన్ని సోమవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి పద్మశ్రీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వేసిన శిలాఫలకం ఇప్పుడు ఎక్కడా కనిపించడంలేదని ఎద్దేవా చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా మాటలు చెబుతున్నారే తప్ప చేతల్లో మాత్రం ముందుకు రావడంలేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాముల బ్రహ్మానందరెడ్డి, ఇర్ఫాన్ బాషా, సుజాత తదితరులు పాల్గొన్నారు.