
గోల్డ్ జ్యువెలరీ మేకింగ్ క్లస్టర్ ఏర్పాటు
కడప సెవెన్రోడ్స్ : పుత్తడిపురి ప్రొద్దుటూరులో గోల్డ్ జ్యువెలరీ మేకింగ్ క్లస్టర్ (జీజేఎంసీ) ఏర్పాటుచేసేందుకు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ప్రొద్దుటూరు గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ బంగారు వ్యాపారంలో రెండవ బాంబేగా ప్రసిద్ధిగాంచిన ప్రొద్దుటూరులో జీజేఎంసీ ఏర్పాటయితే వైఎస్ఆర్ కడప జిల్లాకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వస్తుందన్నారు. పారిశ్రామిక రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా అన్ని రంగాల్లో నైపుణ్యం కలిగిన తయారీదారులు, పెట్టుబడి దారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఈ సమావేశంలో ఏపీఐఐసీ జెడ్ఎం శ్రీనివాస మూర్తి, పరిశ్రమల శాఖ జీఎం చాంద్బాషా, ఎల్డీఎం జనార్దనం, డీటీసీ డిప్యూటీ కమిషన్ ఆఫ్ లేబర్ రంగరాజు, పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ శారదమ్మ, ప్రొద్దుటూరు గోల్డ్ మర్చంట్స్ పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి