
ప్రాణాలు కాపాడిన రైల్వే పోలీస్
జమ్మలమడుగు : కుటుంబ కలహాలతో విసిగి ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన వ్యక్తిని వారించి రైల్వే పోలీసులు ప్రాణాలు కాపాడిన సంఘటన మంగళవారం జరిగింది. ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి పల్లెటి మునుస్వామి మంగళవారం ఎర్రగుంట్ల మండలం కల్లమల్ల రైల్వే స్టేషన్కు వచ్చాడు. సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. ఈ విషయం గమనించిన రైల్వే స్టేషన్ మాస్టర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోమవారం ఆర్థరాత్రి జీఆర్పీ ఆర్ఎస్ఐ రవిచంద్ర, ఆర్పీఎఫ్ ఏఎస్ఐ శివకుమార్ కలమల్ల రైల్వే స్టేషన్కు వెళ్లి మునుస్వామిని విచారించారు. అతడిని వారించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చి మునుస్వామిని భార్య, కుమారుల వెంట పంపించారు.