రెండు మూడు నెలలకు ఒకసారైనా మండల సమావేశాలు ఏర్పాటు చేస్తే గ్రామాలు ఎలా అభివృద్ధి చేయాలనే అంశంలో అవగాహన కలుగుతుంది. అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు సర్పంచులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టే నూతన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అవగాహన కలుగుతుంది. దీంతో ప్రజలకు కూడా అవగాహన కలిగించవచ్చు.
– కూతాటి సంధ్య, సర్పంచ్, బట్టుగూడెం
సభలు ఏర్పాటు చేయాలి
గతంలో మండల పరిషత్ పాలకవర్గాలు ఉన్న సమయంలో మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించిన మాదిరి మండల స్థాయి అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలి. దీంతో ఆయా శాఖల అధికారులకు, సర్పంచ్లకు మధ్య సమన్వయం ఏర్పడుతుంది. అధికారులతో పరిచ యం ఏర్పడి స్నేహపూర్వక వాతావరణంలో గ్రామాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.
– మెండె ముత్యాలు, సర్పంచ్, తుంగతూర్తి


