యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకొని బుధవారం ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. వేకువజామునే ముఖ మండపంలో స్వాతి హోమాన్ని జరిపించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు శత ఘటాభిషేకం నిర్వహించారు. ఆలయంలో గజ వాహనసేవ, నిత్య కల్యాణం వైభవంగా జరిపించారు. భక్తులు యాదగిరిగుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. పూజల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దంపతులు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఈఓ భవానీ శంకర్, తదితరులు పాల్గొన్నారు.


