సాక్షి, యాదాద్రి : భూము రీ సర్వేను పారదర్శకంగా చేపట్టాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి ఆదేశించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో భూముల రీసర్వేపై అధికారులతో సమీక్షించి మాట్లాడారు. నిర్దేశించిన గడువులోగా సర్వేను పూర్తి చేయాలని కోరారు. సహాయ సంచాలకులు (సర్వే – భూ రికార్డులు ) సుజాత , మండల సర్వేయర్ శ్రీ దేవా రీసర్వే ప్రాజెక్టు లక్ష్యాలు, అమలు విధానంపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ జయమ్మ, ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి


