మిర్యాలగూడ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లకు పెంచడం నిరుద్యోగులకు ఎంతో ఊరటనిస్తుంది. ఈ నిర్ణయంతో వయస్సు దాటిపోతుందని ఆందోళన లేకుండా నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారు.
– ఫెరోజ్, బీటెక్, మిర్యాలగూడ
నకిరేకల్ : గత పన్నెండేళ్లుగా అరకొర ఉద్యోగ నోటిఫికేషన్లతో నిరుద్యోగులు చాలా నష్టపోయారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గరిష్ట వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి ఉంటే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కలిగిన ఒక తరం నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– పల్స వెంకటేశ్వర్లు, నకిరేకల్


