మా పాఠశాలలో 61 మంది టెన్త్ విద్యార్థులున్నారు. పరీక్షలు బాగా రాసేలా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు డిసెంబర్ వరకే సిలబస్ పూర్తి చేయించాం. ప్రతి ఉపాధ్యాయుడు నలుగురు చొప్పున విద్యార్థులను దత్తత తీసుకున్నాం. ఆ నలుగురు విద్యార్థులు బడికి రెగ్యులర్గా వచ్చేలా చూడడం.. పరీక్షలు రాసే విధానంపై అవగాహన కల్పించడం. సందేహాలు ఉంటే నివృత్తి చేయడం వంటి చర్యలు తీసుకున్నాం. దీంతో జిల్లాలో టాప్మార్కులు సాధించిన పంది మందిలో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు.
–కె.మనోజ్కుమార్, హెచ్ఎం,
జెడ్పీహెచ్ఎస్ రఘునాథపురం, రాజాపేట మండలం


