గమనించకపోతే ప్రమాదమే.. | - | Sakshi
Sakshi News home page

గమనించకపోతే ప్రమాదమే..

Oct 15 2025 5:24 AM | Updated on Oct 15 2025 5:24 AM

గమనించకపోతే ప్రమాదమే..

గమనించకపోతే ప్రమాదమే..

భూదాన్‌పోచంపల్లి : మండలంలోని జూలూరు–రుద్రవెల్లి గ్రామాల మధ్య ఉన్న లోలెవల్‌ బ్రిడ్జి రాళ్లుతేలి ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మూసీ ఉప్పొంగి ప్రవహించడంతో బ్రిడ్జిలోని కొంత భాగం ధ్వంసమైంది. భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్‌ మండలాల వారు ఈ దారిలో రాకపోకలు సాగిస్తుంటారు. వాహనదారులను అప్రమత్తం చేసేందుకు అధికారులు అక్కడ రాళ్లను అడ్డంగా పెట్టారు. రాత్రి వేళ్లల్లో రాళ్లను గమనించకపోతే వాహనదారులు మూసీలో పడిపోయే ప్రమాదం ఉంది. అధికారులు వంతెనకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ధ్వంసమైన జూలూరు, రుద్రవెల్లి బ్రిడ్జి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement