
నృసింహుడి సన్నిధిలో కోలాహలం
యాదగిరిగుట్ట: పంచనారసింహుడు కొలువైన యాదగిరి క్షేత్రంలో ఆదివారం నిత్యపూజలు, భక్తుల రద్దీతో కోలాహలం నెలకొంది. వేకువజామున సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా శ్రీసుదర్శన నారసింహ హోమం, ఆ తరువాత గజవాహన సేవ, ఉత్సవమూర్తుల నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో వెండి జోడు సేవను ఊరేగించారు. రాత్రికి శ్రీస్వామి, అమ్మవారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.

నృసింహుడి సన్నిధిలో కోలాహలం