
తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది
సూర్యాపేట : తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిదని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం ఎక్స్ రోడ్డు వద్ద మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తల్లిదండ్రులైన బూర లక్ష్మయ్య గౌడ్, బూర రాజమ్మల జ్ఞాపకార్థం వారి విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి తనను చదివించారని, వారి జ్ఞాపకార్థం వారి విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ పిల్లలు ఉన్నత స్థితికి ఎదగాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తారని, వారి కోరిక తీరే విధంగా పిల్లలు కష్టపడి చదివి జీవితంలో ఉన్న స్థాయికి చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, మాజీ అధికార ప్రతినిధి బూర మల్సూరు గౌడ్, బీజేపీ నాయకులు కడియం రామచంద్రయ్య, మన్మథ రెడ్డి, చల్లమల్ల నరసింహ పాల్గొన్నారు.
ఫ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్