మోదీ వల్లే ప్రపంచదేశాల్లో భారత్‌కు గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

మోదీ వల్లే ప్రపంచదేశాల్లో భారత్‌కు గుర్తింపు

Jun 13 2025 4:36 AM | Updated on Jun 13 2025 4:36 AM

మోదీ వల్లే ప్రపంచదేశాల్లో భారత్‌కు గుర్తింపు

మోదీ వల్లే ప్రపంచదేశాల్లో భారత్‌కు గుర్తింపు

భువనగిరి: భారతకు ప్రపంచదేశాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని నరేంద్రమోదీకే దక్కుతుందని బీజేపీ తెలంగాణ సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ తివారీజీ అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పాలన 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భువనగిరిలోని బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు.. ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. మోదీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అంతకుముందు మొక్కలు నాటడంతో పాటు వరసిద్ధి వినాయక దేవాలయంలో పూజలు నిర్వహించారు. అలాగే మట్టి బాటిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ధర్మరావు, భరత్‌ ప్రసాద్‌, నాయకులు ఏలే చంద్రశేఖర్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌, నాయకులు పట్నం కపిల్‌, రత్నపురం బలరాం, ఉడుత భాస్కర్‌, ప్రవీణ్‌, మాజీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్‌, పోతంశెట్టి రవీందర్‌, దాసరి మల్లేశం, చందుపట్ల వెంకటేశ్వరరావు, గూడూరునారాయణరెడ్డి, పడమటి జగన్మోహన్‌రెడ్డి, నర్ల నర్సింగ్‌రావు, మాయ దశరథ, సీఎన్‌రెడ్డి, పడాల శ్రీనివాస్‌, చందా మహేందర్‌ గుప్తా, వైజయంతి, సుర్వి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement