
బడిగంట మోగింది..
పండుగ వాతావరణంలో పాఠశాలలు పునఃప్రారంభం
తక్కువగా వచ్చారు
విద్యా సంవత్సరం మొదటి రోజు కావడంతో పాఠశాలలకు విద్యార్థులు తక్కువగా హాజరయ్యారు. గతంలో మూతపడ్డ ప్రాథమిక పాఠశాలలను తిరిగి తెరిచాం. పేరెంట్స్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేశాం. యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ అందజేశాం. సాయంత్రం పాఠశాలలు ముగిసిన అనంతరం ప్రతి రోజూ సాయంత్రం గంట సమయం అదనంగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని నిర్ణయించాం.
–సత్యనారాయణ, డీఈఓ
సాక్షి,యాదాద్రి: బడిగంట మోగింది. నూతన విద్యా సంవత్సరం గురువారం నుంచి పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలను పూలు, మామిడి తోరణాలు, ముగ్గులతో అలంకరించడంతో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులకు ఉపాధ్యాయులు గులాబీ పువ్వులు అందజేసి స్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత తోటి స్నేహితులు కలవడంతో విద్యార్థులు కబుర్లు చెప్పుకుంటూ.. ఉపాధ్యాయులు చెప్పే విశేషాలు వింటూ గడిపేశారు. తొలిరోజు కావడంతో విద్యార్థులు అంతంత మాత్రమే హాజరయ్యారు.
పుస్తకాలు, యూనిఫాం అందజేత
జిల్లాలో అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలు 754 ఉన్నాయి. వీటిలో సుమారు 53 వేల మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలకు హాజరైన విద్యార్థులందరికీ ఉచిత పాఠ్య, నోట్ పుస్తకాలతో పాటు ఒక జత చొప్పున స్కూల్ యూనిఫాం అందజేశారు.
విద్యార్థులు ఇలా..
తొలిరోజు పాఠశాలలకు 40 శాతం లోపే విద్యార్థులు హాజరయ్యారు. ఆత్మకూర్(ఎం) మండలం పోతిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలకు ఒక్క విద్యార్థి కూడా హాజరుకాలేదు. సోమవారం నుంచి విద్యార్థుల హాజరు పెరగనుందని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. వసతిగృహాల విద్యార్థులు ఇళ్లనుంచి రాలేదు. అంతేకాకుండా బడి బాటలో గుర్తించిన విద్యార్థులను పాఠశాల ల్లో చేర్పించాల్సి ఉంది.
ఫ విద్యార్థులకు వినూత్నంగా వెల్కమ్ చెప్పిన ఉపాధ్యాయులు
ఫ పాఠ్య, నోట్ పుస్తకాలు, ఒక జత చొప్పున యూనిఫాం పంపిణీ
ఫ గతంలో మూతపడిన పాఠశాలలు విద్యార్థులతో కళకళ

బడిగంట మోగింది..

బడిగంట మోగింది..