
ఇంచార్జి మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్కుమార్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జి మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్కుమార్ నిమితులయ్యారు. కరీంనగర్ జిల్లాకు చెందిన లక్ష్మణ్కుమార్ను ఇటీవల ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ మంత్రిగా నియమించిన విషయం విధితమే. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్రావును కరీంనగర్ జిల్లా ఇంచార్జిగా ప్రభుత్వం నియమించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణా రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రిగా ఉన్న కోమటి రెడ్డి వెంకట్రెడ్డి, కరీంనగర్ జిల్లా ఇంచార్జిగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డికి ఈసారి ఎక్కడా బాధ్యతలు అప్పగించలేదు.
104 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు
భువనగిరి: వేసవి సెలవుల్లో నిర్వహించిన వృత్యంతర శిక్షణకు హాజరుకాని ఉపాధ్యాయులకు డీఈఓ సత్యనారాయణ గురువారం నోటీసులు జారీ చేశారు. మే నెలలో ఉపాధ్యాయులకు ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వగా 104 మంది వెళ్లలేదు. దీంతో వారికి నోటీసులు జారీ చేసి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని డీఈఓ పేర్కొన్నారు.
మోత్కూరు మీదుగా ఎలక్ట్రిక్ బస్సులు
మోత్కూరు: సూర్యాపేట డిపో ఆధ్వర్యంలో సూర్యాపేట నుంచి తిరుమలగిరి, మోత్కూరు, భువనగిరి మీదుగా సికింద్రాబాద్ వరకు ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సులు బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఉదయం 5 గంటలకు, 6.30, 7.10, 7.50, 8.30, మధ్యాహ్నం 12.30, 1.10, 1.50, 2.30, 3.10 గంటలకు సూర్యాపేట డిపోనుంచి బస్సులు బయలుదేరనున్నాయి. అదే విధంగా సికింద్రాబాద్ నుంచి సూర్యాపేటకు సాయంత్రం 5 గంటలకు, 5.40, 6.20, 7, 7.40, 14.30, 3.15, 3.55, 4.35, 5.15 గంటలకు బస్సులు వస్తాయని సూర్యాపేట డిపో మేనేజర్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎలక్ట్రికల్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కూడా వర్తిస్తుందని తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరిటౌన్: అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలి కలెక్టర్ అదనపు కలెక్టర్ వీరారెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు. అర్హులకు రూ.20 వేలు ఆర్థిక సహాయం అందుతుందన్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబ యజమాని ఏ కారణం చేత మరణించినా పథకం వర్తిస్తుందన్నారు. మీసేవ కేంద్రాలు లేదా నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. జూలై 2022 నుంచి రైతు ఆత్మహత్యలకు సంబంధించి 624, వితంతు పింఛన్కు 2,269 దరఖాస్తులు ప్రజావాణి కార్యక్రమంలో వచ్చాయన్నారు.