
కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ఉపాధ్యాయుడు
మోత్కూరు : మోత్కూరు పట్టణానికి చెందిన దాసరి వెంకన్న జనగామ జిల్లా దేవరుప్పుల మండలం దరావత్ తండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పాఠశాలలు పునః ప్రారంభమైన సందర్భంగా తన కుమారుడు రాహుల్ను శుక్రవారం మోత్కూరు జిల్లా పరిషత్ పాఠశాలలో 6వ తరగతిలో చేర్పించాడు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని, విద్యార్థి సంపూర్ణ మనో వికాసానికి దోహదపడే బోధన ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటుందని వెంకన్న చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తీపిరెడ్డి గోపాల్రెడ్డి విద్యార్థి రాహుల్కు అడ్మిషన్ అందజేశారు. కాగా, రాహుల్ 5వ తరగతి వరకు ప్రైవేట్ పాఠశాలలో చదివాడు.