
ట్రాన్స్కో, డిస్కమ్ ఇంటర్ సర్కిల్ కబడ్డీ విజేత నల్ల
హన్మకొండ: తెలంగాణ ట్రాన్స్కో, డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ 2025–2026 శుక్రవారం ముగిసింది. కబడ్డీ ఫైనల్లో నల్లగొండ, వరంగల్ జట్లు పోటీపడగా నల్లగొండ జట్టు విజేతగా నిలిచింది. వరంగల్ జట్టు ద్వితీయ స్థానం, నిజామాబాద్ తృతీయ స్థానంలో నిలిచాయి. కబడ్డీ పోటీల్లో 12 జట్లు, బాల్ బ్యాడ్మింటన్లో 9 జట్లు పాల్గొన్నాయి. బాల్ బ్యాడ్మింటన్ ఫైనల్లో వరంగల్, మహబూబ్నగర్ జట్లు పోటీ పడగా వరంగల్ సర్కిల్ విద్యుత్ ఉద్యోగుల జట్టు విజేతగా నిలిచింది. మహబూబ్నగర్ జట్టు ద్వితీయ స్థానంలో, నల్లగొండ జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి.