
వార్డుల పరిధి మారుతోంది
ఆలేరు: ఆలేరు మున్సిపాలిటీలో వార్డుల పరిధి, ఓటర్ల సంఖ్య మారనుంది. ఇటీవల రెండో వార్డులో భాగమైన సాయిగూడెం గ్రామ పంచాయతీగా ఏర్పడిన నేపథ్యంలో వార్డుల పునర్విభజన అనివార్యమైంది. ఈ వార్డు నుంచి సుమారు 888 ఓటర్లు సాయిగూడెంలోకి వెళ్లారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి.
ఓటర్లు ఇలా..
2020 మున్సిపల్ ఎన్నికల సమయానికి ఆలేరు మున్సిపాలిటీలో మహిళలు 6,597, పురుషులు 6,678 మొత్తం 13,275 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం మహిళలు 6,902, పురుషులు 6,624 మొత్తం13, 526 మంది ఓటర్లు నమోదయ్యారు. కొత్తగా 251మంది ఓటర్లు పెరిగారు. కాగా వార్డుల పునర్విభజనలో భాగంగా ఒక వార్డు పరిధిలో సగటున 1,127 మంది ఓటర్లు ఉండాలని అధికారులు నిర్ణయించారు. ఈ సంఖ్యకు పది శాతం తక్కువ (1,014), ఎక్కువ శాతం(1,240) ఓటర్లకు మించకుండా వార్డుల విభజన చేపట్టారు. దాంతో ఒక వా ర్డు పరిధిలోని కాలనీ.. మరో వార్డులోకి వెళ్లనుంది.
ఒక కాలనీ.. వేర్వేరు వార్డుల పరిధిలోకి..
● పునర్విభజన వల్ల 2,3,4,5 వార్డుల్లో ఎక్కువగా మార్పులు చోటు చేసుకున్నాయి.
● 3వ వార్డు పరిధిలోని బుడిగజంగాల కాలనీ, ఆదర్శనగర్ కాలనీ(14–255 ఇంటి నుంచి చివరి ఇంటి వరకు కొంతభాగం), రైల్వే క్వార్టర్స్ కాలనీ 2వ వార్డు పరిధిలోకి వెళ్లాయి.
● 4వ వార్డులో ఉన్న కాటమయ్యనగర్ కొంతభాగం 3 వార్డులోకి వెళ్లింది.
● 5 వార్డు పరిధిలోని మెయిన్రోడ్డు కొంతభాగం 4వ వార్డు పరిధిలోకి వెళ్లింది. ఆయా కాలనీల ఓటర్లు మారిన వార్డు పరిధిలోకి వెళ్లనున్నారు.
16 వరకు దరఖాస్తుల పరిశీలన
16వ తేదీ వరకు వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి సమస్య పరిష్కరిస్తారు. అనంతరం ఆమోదం కోసం కలెక్టర్కు పంపించనున్నారు. అనంతరం మున్సిపల్ ఉన్నతాధికారుల పరిశీలిస్తారు. తుది జాబితా ఈనెల 21న ఖరారుకానుంది.
పారదర్శకంగా వార్డుల పునర్విభజన
వార్డుల పునర్విభజన పారదర్శకంగా చేపట్టాం. విభజనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఐదుగురు దరఖాస్తులు అందజేశారు. వాటిని పరిశీలించి 16వ తేదీ వరకు పరిష్కారం చూపుతాం. ఆ తరువాత కలెక్టర్ ఆమోదం కోసం పంపిస్తాం. మున్సిపల్ ఉన్నతాధికారుల ఆమోదం అనంతరం తుది జాబితా ఈనెల 21న ఖరారవుతుంది.
–శ్రీనివాస్, ఆలేరు మున్సిపల్ కమిషనర్
అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి
వార్డుల పునర్విభజన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. వార్డుల విభజన, ఓటర్ల కేటాయింపు, వార్డులు, ఇంటి నంబర్లు, కాలనీల వారీగా ఓటరు జాబితా రూపొందించడంపై అఖిలపక్ష సమావేశంలో చర్చించాలి. ఇందుకోసం మున్సిపల్ కమిషనర్ చొరవ చూపాలి. –మొరిగాడి మాధవి,
మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్
ఆలేరు మున్సిపాలిటీ నుంచి విడిపోయిన సాయిగూడెం
ఫ గ్రామ పంచాయతీగా ఏర్పాటు
ఫ మరోసారి వార్డుల పునర్విభజన
ఫ విభజన అశాసీ్త్రయంగా ఉందంటూ పలువురి అభ్యంతరం
అభ్యంతరాలు ఇవీ..
వార్డుల పునర్వివిభజనపై మున్సిపల్ కమిషనర్ ఈనెల 5వ తేదీన ముసాయిదా ప్రకటన విడుదల చేశారు. ప్రజలు అభ్యంతరాలు తెలియజేసేందుకు ఈనెల 11వ తేదీ వరకు గడువు ఇవ్వగా ఐదు దరఖాస్తులు వచ్చాయి.
11వ వార్డుకు చెందిన కొంతమంది ఓటర్లు వేరే వార్డులోకి వెళ్లడంతో పాటు కొత్త ఓటర్లు ఎక్కువగా ఉన్నారని అభ్యంతరం.
బీసీ కాలనీ ఓట్లన్నీ రెండు వార్డుల్లో కాకుండా ఒకే వార్డు పరిధిలో ఉండాలి.
6వ వార్డులో న్యూశాంతినగర్, డబుల్ బెడ్రూం కాలనీ మాత్రమే ఉండాలి. అదనపు కాలనీలు వద్దు.
ఇంటి నంబర్ల వారీగా ఓటర్లంతా ఒక వార్డుల్లోనే ఉండాలని ఆయా ప్రాంతాల ప్రజలు దరఖాస్తులు అందజేశారు.

వార్డుల పరిధి మారుతోంది