
పీసీసీ పరిశీలకులొస్తున్నారు!
సాక్షి,యాదాద్రి : నేతలు, ప్రజాప్రతినిధులు, శ్రేణులను సమన్వయం చేస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పీసీసీ చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు పరిశీలకులను నియమించింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు వరంగల్ జెడ్పీ మాజీ చైర్మన్ లకావత్ ధనవంతి, డాక్టర్ పులి అనిల్కుమార్ నియమించింది.
పరిశీలకుల బాధ్యతలు
జిల్లా పరిశీలకులుగా నియమితులైన ధనవంతి, పులి అనిల్కుమార్ త్వరలో బాధ్యతలు స్వీకరించ నున్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ, పీసీసీ డెలిగేట్స్, డీసీసీ మాజీ అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, సీని యర్ నేతలతో సమావేశం కానున్నారు. ఆ తరువాత జిల్లా, మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి అధిష్టానానికి నివేదికలు అందజేస్తారు. వీటి అధారంగా స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులు దక్కనున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు.
భదాద్రి కొత్తగూడెం జిల్లాకు పోత్నక్ ప్రమోద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిశీలకుడిగా భువనగిరి పట్టణానికి చెందిన పోత్నక్ ప్రమోద్కుమార్ను నియమించారు. ప్రస్తుతం పీసీసీ కార్యదర్శిగా ఉన్న ప్రమోద్కుమార్ గతంలోనే పార్టీలో వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం ఉంది.
ఫ జిల్లాకు ఇద్దరి నియామకం
ఫ లకావత్ ధనవంతి, పులి అనిల్కుమార్కు బాధ్యతలు