ప్రస్తుతం జిల్లాలో వానాకాలం సాగు పనులు ఊపందుకున్నాయి. రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయాల్సి ఉండటంతో పాటు ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాల అద్దెలు, కూలీల ఖర్చులు భరించాల్సి వస్తోంది. గత పంట విక్రయాల ద్వారా రావాల్సిన డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో బ్యాంకుల నుంచి రుణాలు పొందలేని చిన్న, సన్నకారు రైతులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకునే ప్రమాదం ఉంది. వెంటనే బకాయిలు చెల్లిస్తే టెన్షన్ లేకుండా రైతులు సాగు చేసుకునే అవకాశముంది.
–సోమిడి శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్


