బక్రీద్‌కు ఈద్గా మైదానం ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

బక్రీద్‌కు ఈద్గా మైదానం ముస్తాబు

May 28 2026 12:28 AM | Updated on May 28 2026 12:28 AM

బక్రీద్‌కు ఈద్గా మైదానం ముస్తాబు

ఖిలా వరంగల్‌: వరంగల్‌ ఫోర్ట్‌ రోడ్డులోని ఈద్గా మైదానం బక్రీద్‌కు ముస్తాబైంది. గురువారం ఉదయం 9 గంటలకు జరగనున్న ఈద్‌–ఉల్‌–జుహా సామూహిక ప్రార్థనలకు సర్వం సిద్ధమైంది. మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు బల్దియా అధికారులు ఏర్పాట్లు చేశారు. ముస్లిం, మైనార్టీ నేతలతో కలిసి ఈద్గా బక్రీద్‌ నిర్వహణ కమిటీ ప్రతినిధి ఎంఏ ఖలీక్‌ తన్వీర్‌ (ముతవల్లి) మైదానాన్ని బుధవారం పరిశీలించారు. ఈద్గాలో మత గురువు మౌలానా హఫీజ్‌మహ్మద్‌ నోమాన్‌ రజా ఆధ్వర్యంలో సామూహిక ప్రార్థనలకు 30 వేల మంది హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట షఫీయొద్దీన్‌, మహిమూద్‌పాషా, సయ్యద్‌ మోహిజ్‌, శౌకత్‌అలీ, ఎండీ యూసుఫ్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement