నర్సంపేట: బీసీ ఏ గ్రూప్లో ఇతర కులాలను కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా యత్నించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని రజక కుల ప్రతినిధి ఐలోని శ్రీనివాస్, నాయీ బ్రాహ్మణ సంఘం ప్రతినిధి సంతపూర్తి రవి తెలిపారు. బీసీ ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఆచార్య డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. బీసీ ఏ గ్రూప్లోని కులాలకు న్యాయం చేయకుండా ఇతర కులాలు కలపడం సరికాదన్నారు. గంగపుత్ర సంఘ ప్రతినిధి జీజుల సాగర్ మాట్లాడుతూ.. బీసీ జనాభాలో ఎక్కువ శాతం ఉన్న ముదిరాజ్లను 7శాతం ఉన్న బీసీ ఏ లో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే విలీన ప్రక్రియను ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మేదర కుల అధ్యక్షుడు షేర్ల శ్రీనివాస్, తడిగొప్పుల మల్లేషం, సాంబరాజు మల్లేషం, తడిగొప్పుల రవి, రవికాంత్, కాపరబోయిన రమేష్, శ్రావణ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


