నెక్కొండ: ప్రమాదవశాత్తు ఆయిల్పామ్ తోట దగ్ధమైన సంఘటన అలంకానిపేట గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. గ్రామానికి చెందిన బాధిత రైతు చీకటి శ్రీనివాస్ కథనం ప్రకారం.. తనకున్న 6 ఎకరాల్లో ఉపాధి హామీ పథకం కింద 2019లో ఆయిల్పామ్ సాగుచేశాడు. ఇప్పుడు గెలలు కోసే దశకు వచ్చింది. ప్రమాదవశాత్తు తోటకు నిప్పంటుకుని మంటలు వ్యాపించాయి. దీంతో గమనించిన స్థానికులు, రైతులు మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లిందని శ్రీనివాస్ వాపోయాడు. తోట మీదుగా వదులుగా ఉన్న విద్యుత్ తీగల రాపిడితో నిప్పు వచ్చి పడడంతోనే ప్రమాదం సంభవించిందని ఆయన పేర్కొన్నాడు. అధికారులు స్పందించి పరిహారం అందించి న్యాయం చేయాలని కోరాడు.


