
ఒక్క సీసీ కెమెరా వందమందితో సమానం
● ఏసీపీ అంబటి నర్సయ్య
రాయపర్తి: ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్స య్య అన్నారు. మంగళవారం రాయపర్తి మండలంలోని మైలారం గ్రామంలో దాతల సహకారంతో ఏ ర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏసీపీ ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యా పార సముదాయాలు, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. మైలారం గ్రామంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై ముత్యం రాజేందర్, పోలీసులు, గ్రామస్తులు పాల్గొన్నారు.