బ్యాంక్‌ డిపాజిట్లు రూ.219.20 కోట్లు | - | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ డిపాజిట్లు రూ.219.20 కోట్లు

Jun 30 2025 3:44 AM | Updated on Jun 30 2025 3:44 AM

బ్యాంక్‌ డిపాజిట్లు రూ.219.20 కోట్లు

బ్యాంక్‌ డిపాజిట్లు రూ.219.20 కోట్లు

రామన్నపేట: వరంగల్‌ అర్బన్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో 14.24 శాతం వృద్ధితో డిపాజిట్లు రూ.219.20 కోట్లకు చేరాయని బ్యాంక్‌ చైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు వెల్లడించారు. నగరంలోని దేశాయిపేట రోడ్డులోని కేఆర్‌ గార్డెన్స్‌లో ఆదివారం బ్యాంక్‌ 29వ మహాజన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రదీప్‌రావు మాట్లాడుతూ.. రుణాల మంజారులో 13.20 శాతం వృద్ధితో రూ154.13 కోట్లు కలిపి మొత్తం వ్యాపారం రూ.373.43 కోట్లకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. ఈఆర్థిక సంవత్సరంలో స్థూల లాభం రూ.3.03 కోట్లు కాగా అందులో రూ.60.90 లక్షల ఆదాయపు పన్ను చెల్లించగా నికరలాభం రూ.2.22 కోట్లు అర్జించినట్లు వెల్లడించారు. డిపాజిట్‌ దారులకు రిజర్వ్‌ బ్యాంకు నిబంధనల మేరకు డీఐసీజీసీ ద్వారా రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. ఈఆర్థిక సంవత్సరంలో గోపాల్‌పూర్‌, మహబూబాబాద్‌, జనగాం, వడ్డేపల్లి నూతన శాఖలను ప్రారంభించనట్లు తెలిపారు. సమావేశంలో బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ తోట జగన్నాథం, డైరెక్టర్లు వేణుగోపాల్‌ ముందడ, కూరపాటి చంద్రమౌళి, తోట సంపత్‌కుమార్‌, మహమ్మద్‌ గౌసొద్దీన్‌, ఒడితర పవన్‌కుమార్‌, బొమ్మినేని పాపిరెడ్డి, పొన్న హరినాథ్‌, పోలేపాక రవికుమార్‌, బండారి భార్గవి, మంద స్వప్న, నామినేట్‌ డైరెక్టర్లు అప్పరాజు రాజేంద్రకుమార్‌, పుల్లూరి సుధాకర్‌, బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఎం.సత్యనారాయణరావు, వరంగల్‌, హనుమకొండ డీసీఓ లు కోదండ రాములు, సంజీవరెడ్డి, ఏఆర్‌ అన్నమనేని జగన్మోహన్‌రావు, సేల్స్‌ ఆఫీసర్‌ కె.రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ అర్బన్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ ప్రదీప్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement