కొత్త మెనూ.. కడుపునిండా తిను! | - | Sakshi
Sakshi News home page

కొత్త మెనూ.. కడుపునిండా తిను!

Jun 30 2025 3:44 AM | Updated on Jun 30 2025 3:44 AM

కొత్త మెనూ.. కడుపునిండా తిను!

కొత్త మెనూ.. కడుపునిండా తిను!

కాజీపేట: విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసే ఆలోచనలతో నూతన సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా కస్తూ ర్బా గాంధీ బాలికల విద్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసింది. కస్తూర్బా ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నూతన ఆహార పట్టిక అమలు చేయాలని ఆదేశాలను జారీ చేసింది. వారంలో అయిదు సార్లు కోడిగుడ్లు, నెలలో రెండు సార్లు మాంసం, రోజూ నెయ్యి వడ్డించాలని నిర్ణయించారు. నూతన వంటకాల తయారీకి అనుగుణంగా వంట మనుషులకు విద్యాశాఖ అధికారులు తగిన శిక్షణ ఇప్పించారు.

పెరిగిన మెస్‌ చార్జీలు

హనుమకొండ జిల్లాలో 9 కేజీబీవీలున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో సరికొత్త రుచులతో వంటకాలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా మెస్‌చార్జీలను పెంచింది. గతంలో ఒక్కో విద్యార్థికి నెలకు మెస్‌ ఛార్జీ రూ.1,225 ఉండేది. ప్రస్తుతం రూ.1,740కి పెంచింది.

పర్యవేక్షణతో అమలు

ప్రభుత్వం ప్రత్యేక చొరవతో నూతన మెనూను రూపొందించింది. దీని అమలుకు కార్యాచరణ అమలుకు ఆదేశాలను జారీ చేసింది. జిల్లా, మండల అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు చేస్తేనే కొత్త ఆహార పట్టిక అమలకు నోచుకుంటుందని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.

కస్తూర్బా ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం

మెనూ ఇలా..

ఉదయం: అల్పాహారంలో టమాటా కిచిడీ, రాగిజావ, ఇడ్లీ, సాంబర్‌, పాలు (బూస్ట్‌), పూరి, పులిహార, బోండా, ఉప్మా, చపాతీ, జీరా రైస్‌, అరటి పండు ఇవ్వాలి.

మధ్యాహ్నం: అన్నంతో పాటు టమాటా పప్పు, నెయ్యి, రసం, పెరుగు, ఉడికించిన గుడ్డు, చికెన్‌, మటన్‌ ఇవ్వాలి.

సాయంత్రం: ఉడికిన పెసలు, శనగలు, ఎగ్‌బజ్జీ, బెల్లం పల్లీలు, అల్లం చాయ్‌, మిల్లెట్‌ బిస్కెట్లు, పకోడి

రాత్రి: అన్నంతో పాటు వివిధ రకాల కూరలు, సాంబర్‌, మజ్జిగ ఇవ్వాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement