మామూళ్ల మత్తు | - | Sakshi
Sakshi News home page

మామూళ్ల మత్తు

Jun 30 2025 3:44 AM | Updated on Jun 30 2025 3:44 AM

మామూళ

మామూళ్ల మత్తు

సోమవారం శ్రీ 30 శ్రీ జూన్‌ శ్రీ 2025

టీచర్లకు బదిలీలు,

పదోన్నతులు చేపట్టాలి

విద్యారణ్యపురి: టీచర్లకు బదిలీలు, పద్నోతుల ప్రక్రియ చేపట్టాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.సోమశేఖర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం హనుమకొండలోని సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌. రవీందర్‌రాజు ఆధ్వర్యాన నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణతో అనేక పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడిందని, భర్తీ చేసేందుకు వెంటనే బదిలీ లు, పదోన్నతులు చేపట్టాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కరువుభత్యం విడుదల చేయాలని, సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు, ఉపాధ్యక్షులు వి.రాజారామ్‌, జ్యోతి, కార్యదర్శులు సీఎస్‌ఆర్‌.మల్లిక్‌, కె.సదా నందం, ఎం.ప్రసన్నానంద్‌, కె.శశిధర్‌రెడ్డి, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ జి.భాస్కర్‌రావు, బాధ్యులు ఎ.బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.

నేడు ‘డయల్‌ యువర్‌ డీఎం’

హన్మకొండ: మెరుగైన సేవలు అందించేందు కు ప్రయాణికుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఈనెల 30న ‘డయల్‌ యువర్‌ డీఎం’ కార్యక్ర మం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్‌ భూక్యా ధరంసింగ్‌ తెలిపారు. ఉదయం 11నుంచి 12గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో జమ్మికుంట, వేలేరు, ఐనవోలు, పర్వతగిరి, సంగెం, ఖిలా వరంగల్‌, హనుమకొండ, హసన్‌పర్తి, కమలాపూర్‌, వరంగల్‌, హనుమకొండ, కాజీపేట ప్రాంత ప్రయాణికులు 89777 81103 నంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యలు వివరించడంతోపాటు, సలహా లు, సూచనలు ఇవ్వాలని ఒక ప్రకటనలో కోరారు.

డాక్టర్‌ వేణుకు అవార్డు

గీసుకొండ: గ్రేటర్‌ వరంగల్‌ 16వ డివిజన్‌ ధర్మారానికి చెందిన హైదరాబాద్‌ ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి అసోసియేట్‌ ప్రొఫెసర్‌ (జనరల్‌ సర్జన్‌) డాక్టర్‌ గాదె వేణు రాష్ట్రీయ సేవా జాతీయ అవార్డు–2025ను అందుకున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆసియా వేదిక్‌ ఇంటర్నేషనల్‌ కల్చర్‌ అండ్‌ రీసెర్చ్‌ స్ఫూర్తి అకాడమీ వారు ఈ అవార్డును ఆయనకు అందించి సన్మానించారు. డాక్టర్‌ వేణు నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం చదువుకున్నారు. ఆ తర్వాత ఎంబీబీఎస్‌, ఎంఎస్‌ పూర్తి చేశారు. గతంలో ఆయన వరంగల్‌ ఎంజీఎం, ఆదిలాబాద్‌, వరంగల్‌లోని పలు ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో వైద్యసేవలు అందించారు. తన స్వగ్రామంలో ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

జిల్లాలో మోస్తరు వర్షం

హన్మకొండ: హనుమకొండ జిల్లాలో ఆదివారం మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. నెల రోజులుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా మెట్ట పంటల మొలకలు వాడిపోతున్న క్రమంలో కురిసిన వర్షం జీవం పోసింది. రాత్రి 10 గంటల వరకు ఆటోమెటిక్‌ వెదర్‌ స్టేషన్‌లో నమోదైన వర్షపాతం వివరాలను ప్రణాళిక శాఖ విడుదల చేసింది. దామెర మండలం పులుకుర్తిలో 38.5 మిల్లీమీ టర్లు, వరంగల్‌ పైడిపల్లి 34.5, కమలాపూర్‌ 30.8, శాయంపేట 29.3, వేలేరు 28.3, హసన్‌పర్తి 25.5, హనుమకొండ పెద్దమ్మగడ్డ 24.3, కాజిపేట మడికొండ 18.8, దామెర 17.3, కాజీపేట 17, నడికూడ 16, పరకాల 10.5, ఐనవోలు 10, హసన్‌పర్తి నాగారం 9.5, భీమదేవరపల్లి 9.3, ఆత్మకూరులో 8.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

ప్రతీ ఇంటి నుంచి చెత్త సేకరించి, తరలించినందుకు విస్తీర్ణం ఎస్‌ఎఫ్‌టీల ఆధారంగా మూడు స్లాబుల్లో నెలకు రూ.60 నుంచి రూ.1,200 వరకు చెత్త పన్ను విధించి ఆస్తి, నీటి పన్నులో జోడించి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.

వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు నిత్యం రూ.వేలు, లక్షల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తుంటారు. భారీగా చెత్త వెలువడే కమర్షి యల్‌ షాపుల నుంచి ప్రతినెలా యూజర్‌ చార్జీల సొమ్ము మాత్రం వసూలు చేయట్లేదు.

ఇలా.. గత 11 ఏళ్లుగా 5శాతం వరకు మాత్రమే కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల నుంచి వసూలు చేస్తుండడంతో బల్దియాకు రావాల్సిన సూమారు రూ.10 కోట్లపైచిలుకు ఆదాయానికి గండిపడింది.

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు దూసుకెళ్తోంది. జాతీయ, అంతర్జాయ సంస్థలు వెలిశాయి. నగరంలో షాపులు, హోటళ్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు ఉదయమే తెరుచుకుంటాయి. అప్పటికే వీధులు, రహదారుల ను పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేసి వెళ్లిపోతారు. ఆతర్వాత షాపు యజమానులు వచ్చి దుకాణాలు తెరిచి శుభ్రం చేయగా.. వచ్చిన చెత్తాచెదారాన్ని తిరిగి షాపుల ఎదుట డ్రెయినేజీ, కాల్వలు, రహదా రులపై పడేయడంతో నగరం అపరిశుభ్రంగా మారుతోంది. ఆస్పత్రుల స్థాయి ఆధారంగా, డయాగ్నొస్టిక్‌ సెంటర్లు, ఫాస్ట్‌పుడ్‌ సెంటర్లు, బేకరీ లు, ఫంక్షన్‌ హాళ్లు, లాడ్జీలు, ప్రైవేట్‌ విశ్రాంతి భవనాలు, క్లబ్బులు, కూరగాయల, వ్యవసాయ మార్కెట్లకు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, ప్రైవేట్‌ హాస్టళ్లు, హోల్‌సేల్‌ పండ్ల వ్యాపారులు, పెద్ద హోటళ్లు, మిడిల్‌ స్థాయి హోటళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, వైన్‌ షాపులు, ఫంక్షన్‌ హాళ్లు ప్రతి నెలా వ్యర్థాల సేకరణకుగాను బల్దియాకు నిర్ణీత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.

యూజర్‌ చార్జీల వసూలేది?

ఆయా సంస్థలు, వ్యాపార కేంద్రాల నుంచి చెత్తాచెదారం వ్యర్థాలను తీసుకెళ్లేందుకు వాటి విస్తీర్ణం ఆ ధారంగా యూజర్‌ చార్జీలు వసూలు చేయాలనే ఆలోచన వరంగల్‌ బల్దియాకు 2013 సంవత్సరంలో వచ్చింది. ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసి షాపుల నుంచి చెత్తను తరలించేందుకు యూజ ర్‌ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించారు. సర్వే చేసి 1,674 సంస్థలను గుర్తించారు. ఆయా సంస్థల నుంచి ఎంత వసూలు చేయాలో ఖరారుచేసి 2014 నుంచి వసూళ్ల ప్రక్రియ ప్రారంభించారు. రెండేళ్ల పాటు 50శాతానికి పైగా వసూలు చేసిన ప్రజారోగ్యం సిబ్బంది తదుపరి క్రమేపీ విస్మరిస్తున్నారు. తొలుత 1,674 వాణిజ్య సంస్థలు ప్రస్తుతం బల్దియా రికార్డుల్లో 427 కుచించుకుపోయాయి. ఈ ఏడాది చార్జీలు రూ.31 లక్షలు నిర్ణయించగా.. ఇప్పటి వరకు రూ.8 లక్షలు వసూలు చేసినట్లు లెక్కలు చెప్పడం అవినీతికి నిదర్శనంగా నిలుస్తోంది.

కంపు.. కంపు

బల్దియా సిబ్బంది నిర్లక్ష్యం.. అవినీతి కారణంగా కమర్షియల్‌ కాంప్లెక్స్‌లలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. నిత్యం షాపుల నుంచి వెలువడే చెత్తనంతా రెండు కాంప్లెక్స్‌ల నడుమ, కాంప్లెక్స్‌ చుట్టూ ఖాళీ స్థలాల్లో నింపేస్తున్నారు. మురుగు వాసన వస్తున్నా.. ఈగలు, దోమలు విజృంభిస్తున్నా అటు బల్దియా, ఇటు కాంప్లెక్స్‌ల యజమానులు, వ్యాపారులు పట్టించుకోవట్లేదు. వ్యాపార సముదాయాల నుంచి వెలువడే చెత్తను రోజూ బల్దియా వాహనాల్లో వేయాలంటే యూజర్‌ చార్జీలు చెల్లించాలి. ఇది ఇష్టం లేని కొందరు వ్యాపారులు ఖాళీ స్థలాల్లో పడేస్తున్నారు.

స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తాం..

వాణిజ్య సంస్థలను స్పెషల్‌ డ్రైవ్‌ నిర్విహించి గుర్తిస్తాం. లోపాలను సరిచేసుకుంటాం. యూజర్‌ చార్జీలను నిబంధనల మేరకు వసూలు చేస్తాం.

– రాజేశ్‌, బల్దియా సీఎంహెచ్‌ఓ

లెక్కలు పక్కా చేస్తున్న సిబ్బంది

న్యూస్‌రీల్‌

‘కమర్షియల్‌’ నుంచి కాసుల పంట

శానిటరీ ఇన్‌స్పెక్టర్ల సహకారంతో

జవాన్ల అక్రమ వసూళ్లు!

యూజర్‌ చార్జీల వసూళ్లలో నిర్లక్ష్యం

ఆదాయంపై పట్టించుకోని

గ్రేటర్‌ అధికార, పాలక వర్గాలు

నగరంలో ప్రజారోగ్యం పచ్చిమోసం!

ఆ సొమ్ము ఎవరి జేబుల్లోకి..

గత పదిన్నరేళ్ల కాలంలో సూమారు రూ.10 కోట్లకుపైగా యూజర్‌ చార్జీల ద్వారా బల్దియా ఆదాయం సమకూరాలి. కానీ.. ఇంత వరకు ఎంత మంది వద్ద సొమ్ము వసూలు చేశారో, ఎవరు ఎగ్గొట్టారో చిక్కుముడిగా మారింది. వాణిజ్య సంస్థల నుంచి ప్రతీ నెల జవాన్లు యూజర్‌ చార్జీలను వసూలు చేయాలి. ఆన్‌లైన్‌ రశీదు ఇవ్వాలి. బల్దియా వద్ద లెక్కాపత్రం లేదు. వసూలు చేయాల్సిన కొంతమంది జవా న్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ల సహకారంతో యూజర్‌ చార్జీలతో సంబంధం లేకుండా నెలవారీ మా మూళ్లకు పాల్పడుతున్నారు. బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, టిఫిన్‌ సెంటర్లు, హోటళ్లు, ఆస్పత్రులు, హాస్టల్స్‌, టిఫిన్‌ సెంట ర్లు ఇలా ప్రతీ వాణిజ్య సంస్థకు మరీ లెక్కగట్టి చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. వసూలు చేసి బల్దియాకు చెల్లించాల్సిన సొమ్మును 90శాతం మందికిపైగా సిబ్బంది తమజేబుల్లో నే వేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

పై ఫొటో హనుమకొండ చౌరస్తా సిటీ బస్టాప్‌ సమీపంలోది. రెండు కాంప్లెక్స్‌ల నడుమ ఒక మీటర్‌ ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో నిత్యం షాపుల నుంచి వెలువడే వ్యర్థాలను పడేస్తున్నారు. గుట్టలుగా చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. ఈగలు ముసురుకుంటున్నాయి. ఇది ఒక చౌరస్తాలో మాత్రమే కాదు. సిటీలోని చాలా కాంప్లెక్స్‌లలోని పరిస్థితి.

వారు అడగరు.. వీరు ఇవ్వరు!

వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకుల నుంచి వ్యర్థాలను తీసుకెళ్లే క్రమంలో ఎంతో కొంత, నెలవారీగా వసూలు చేస్తున్నారు. ఇందుకుగాను యజమానులు, వ్యాపారులు చెల్లించిన సొమ్ముకు రశీదులు అడగడం లేదు. వీరు ఇవ్వడం లేదు. బల్దియా ప్రజారోగ్య శాఖ అధికారులు, కమిషనర్లు యూజర్‌ చార్జీల వసూళ్లపై కనీసం సమీక్షలు, పురోగతిపై సమావేశాలు ఏర్పాటు చేయట్లేదు. దీంతో బల్దియా రికార్డుల్లో ప్రతి నెలా యూజర్‌ చార్జీల సొమ్ము భారీగా పేరుకుపోయింది. అనధికారిక వసూళ్లే అందుకు కారణమనే విమర్శలు ఉన్నాయి. పాలకవర్గం పెద్దలు, నూతన కమిషనర్‌ ఈ సొమ్ము రాబట్టుకుంటారా? లేక వదిలేస్తారా? లేకపోతే శానిటరీ సిబ్బందిపై చర్యలు చేపడతారా? అనేది వేచి చూడాల్సిందే.

మామూళ్ల మత్తు1
1/5

మామూళ్ల మత్తు

మామూళ్ల మత్తు2
2/5

మామూళ్ల మత్తు

మామూళ్ల మత్తు3
3/5

మామూళ్ల మత్తు

మామూళ్ల మత్తు4
4/5

మామూళ్ల మత్తు

మామూళ్ల మత్తు5
5/5

మామూళ్ల మత్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement