మీసేవ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

మీసేవ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి కృషి

Jun 30 2025 3:44 AM | Updated on Jun 30 2025 3:44 AM

మీసేవ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి కృషి

మీసేవ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి కృషి

తెలంగాణ మీసేవ ఫెడరేషన్‌

రాష్ట్ర అధ్యక్షుడు బైరి శంకర్‌

హన్మకొండ: మీసేవ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ మీసేవ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బైరి శంకర్‌ అన్నారు. హనుమకొండ కేఎల్‌ఎన్‌రెడ్డి కాలనీలోని రాధ గ్రాండ్‌ బాంక్వెట్‌ హాల్‌లో ఆదివారం జరిగిన తెలంగాణ మీసేవ హనుమకొండ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసిన తర్వాత తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఎలాంటి దరఖాస్తు చేయకూడదని సూచించారు. అనంతరం తెలంగాణ మీసేవ ఫెడరేషన్‌ హనుమకొండ జిల్లా కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా దేశిని రమేశ్‌, ప్రధాన కార్యదర్శిగా జక్కు రాజు, కోశాధికారిగా పేరాల సురేందర్‌, ఉపాధ్యక్షులుగా మాడిశెట్టి శ్యాంప్రసాద్‌, కొయ్యడ శ్రీనివాస్‌, సంయుక్త కార్యదర్శులుగా గుగులోత్‌ సతీశ్‌, గజ్జెల రమేశ్‌, సంయుక్త కోశాధికారులుగా నాంపల్లి ఆంజనేయులు, బండి కిరణ్‌కుమార్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలుగా పుల్లూరు సునీల్‌, చెన్న విద్యాసాగర్‌, మీడియా ఇన్‌చార్జ్‌లుగా వేముల రాజేందర్‌, గూడూరు అనిల్‌కుమార్‌, మహిళా కోఆర్డినేటర్లుగా సామల రమాదేవి, కట్ల మమత, అధికార ప్రతినిధిగా చాట్ల రాజు ఎన్నికయ్యారు. సర్వసభ్య సమావేశానికి హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు బైరి శంకర్‌ను నూతన కార్యవర్గం సన్మానించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement