
సాగుకు భరోసా
సోమవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోu
ఖిలా వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం రైతులకు అందించింది. జిల్లాలోని 1,56,403 మంది రైతుల ఖాతాల్లో విడతల వారీగా రూ.162.38 కోట్లు జమ చేసింది. ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతు భరోసా అందడంతో పంటల సాగుపై వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీజన్కు ముందుగానే పెట్టుబడి సాయం అందడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జిల్లాలో 3,08,320 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను రైతులు సాగుచేస్తున్నారు. వరి 1,43,803 ఎకరాలు, మొక్కజొన్న 9,820 ఎకరాలు, పతిపత్తి 1,26,173 ఎకరాలు, కంది 1,180 ఎకరాలు, మిర్చి 9 వేల ఎకరాలు, పసుపు 950 ఎకరాలు, ఇతర పంటలు 17, 400 ఎకరాల్లో సాగవుతున్నాయి.
సాగు ప్రారంభంలోనే ..
సాగు పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. దుక్కులు దున్నడానికి, విత్తనాలు విత్తేందుకు పెట్టుబడి కోసం బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తప్పింది. బంగారు ఆభరణాలు సైతం కుదువపెట్టి అప్పులు తేవాల్సి వచ్చేది. ఈ ఏడాది ఆ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలు చేయడంతో రైతుల మోముల్లో వెలుగులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల పత్తి విత్తనాలు విత్తగా కొన్ని చోట్ల కలుపు తీస్తున్నారు. ఇప్పటి వరకు సరైన వర్షాలు లేక పోవడంతో వరిసాగు పనులు ఆలస్యమవుతున్నాయి. పచ్చిరొట్ట విత్తనాలు వేశారు. వర్షాలు పడి చెరువులు, జలాశయాలు నిండితే నార్లు పోయనున్నారు. ముందుగా బావుల కింద ఇప్పటికే నార్లుపోసి నాట్లు వేయటం ప్రారంభించారు. జిల్లాలో కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు అందుకున్న 2,203 మంది రైతులు నుంచి ఈనెల 20 వరకు వ్యవసాయ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. వీరి వివరాలను మండల వ్యవసాయ కార్యాలయాల్లో అధికారులు నమోదు చేశారు. త్వరలో వీరి ఖాతాల్లోనూ రైతు భరోసా డబ్బులు జమకానున్నాయి.
మండలాల వారీగా రైతు భరోసా జమ ఇలా (రూ.కోట్లలో)
మండలం రైతులు నగదు
చెన్నారావుపేట 11,407 10.92
దుగ్గొండి 14,375 13.11
ఖానాపురం 8,656 8.78
నల్లబెల్లి 13,444 14.26
నర్సంపేట 11,914 9.75
నెక్కొండ 14,819 14.98
గీసుకొండ 12,950 12.58
ఖిలా వరంగల్ 4,891 4.14
పర్వతగిరి 14,211 16.27
రాయపర్తి 19,289 24.09
సంగెం 14,846 15.03
వరంగల్ 1,716 1.44
వర్ధన్నపేట 13,885 17.03
1,56,403 162.38
నాకు భరోసానిచ్చింది..
నాకు కాంట్రపల్లి గ్రామంలో 1.17 ఎకరాల భూమి ఉంది. ఆభూమిలో ఏటా వరి సాగు చేస్తున్నా. రైతు భరోసా సాయం కింద 1.17 ఎకరాలకు రూ.8,550 బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. రెండేళ్లుగా సకాలంలో పెట్టుబడి రాక వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల్లో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి వరి సాగు చేశా. ఈ ఏడాది సకాలంలో రైతు భరోసా అందడంతో నేను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డా. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశా. నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎల్లప్పుడు రుణపడి ఉంటా.
– ఉమాదేవి మహిళా రైతు, కాట్రపల్లి, సంగెం మండలం
న్యూస్రీల్
రైతులకు పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం
1,56,403 మంది ఖాతాల్లో రూ.162.38 కోట్లు జమ
వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తప్పిన ప్రదక్షిణలు
జిల్లాలో 3,08,320 ఎకరాల్లో
వివిధ పంటల సాగు
ప్రతీ సీజన్కు రైతు భరోసా..
జిల్లాలో మొత్తం 1,56,403 మంది రైతుల ఖాతాల్లో రూ.162.38 కోట్లు జమయ్యాయి. కేవలం కొద్ది రోజుల్లోనే ఇంత పెద్ద మొత్తంలో అందించింది. ఈసారి విత్తనాలు, ఎరువులు, కూలీలు, ఇతర పంటల పెట్టుబడికి ఈ డబ్బులు రైతులకు భరోసానిచ్చాయి. అలాగే, ప్రతీ సీజన్కు రైతు భరోసా సాయం జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
– అనురాధ జిల్లా వ్యవసాయ అధికారి

సాగుకు భరోసా

సాగుకు భరోసా

సాగుకు భరోసా

సాగుకు భరోసా