
పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్స్గా మార్చాలి
విద్యారణ్యపురి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను సెమీరెసిడెన్షియల్గా మార్చాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (టీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్వహించిన డీటీఎఫ్ హనుమకొండ, వరంగల్ జిల్లాల స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను సెమిరెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చి విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ పాలు అందించాలన్నారు. అంతరాలను పెంచేలా వివిధ రకాల పాఠశాలలు కాకుండా అందరూ కలిసి చదువుకునేలా ఒకేరకమైన పాఠశాలలను ఏర్పాటు చేసి అందరికి సమాన అవకాశాలు ఉన్న నాణ్యమైన విద్యను అందించాలన్నారు.