బొగతలో సండే సందడి | - | Sakshi
Sakshi News home page

బొగతలో సండే సందడి

Jun 30 2025 7:50 AM | Updated on Jun 30 2025 7:50 AM

బొగతల

బొగతలో సండే సందడి

మల్లూరులో పూజలు

ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిక్కిరిసింది. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో ఆలయంలోని లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు భక్తుల గోత్రనామాలతో అర్చనలు జరిపించారు. – మంగపేట

ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతానికి ఆదివారం పర్యాటకులు తరలివచ్చారు. దీంతో బొగత జలపాతం పరిసరాలు పర్యాటకులతో కోలాహలంగా మారాయి. పర్యాటకులు బొగత జలపాతం వద్ద ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడిగా గడిపారు. ఈ క్రమంలో సమీపంలో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా లేచి వచ్చి 20 మంది పర్యాటకులను కుట్టినట్లు తెలిసింది. –వాజేడు

బొగతలో సండే సందడి1
1/1

బొగతలో సండే సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement