జూరాల జలాశయానికి ఎగువ నుంచి వరద వచ్చి చేరుతున్న సమయంలోనే సమాంతర కాల్వ ద్వారా నీటిని తరలించాల్సి ఉంటుంది. వరద నిలిచిన వెంటనే ప్రధాన కాల్వ షట్టర్లను మూసి ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. గతంలో షట్టర్ల లీకేజీతో నీరంతా వృథాగా పారేది. ప్రస్తుతం షట్టర్ల మరమ్మతులు చేపడుతున్న అధికారులు నీటి వృథాను అరికట్టాలి.
– వెంకటేష్, రైతు, నందిమళ్ల
సమాంతర కాల్వ ప్రధాన షట్టర్ల మరమ్మతుకు రూ.60 లక్షలు మంజూరయ్యాయి. మరో పదిరోజుల్లో పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. అనుకున్న సమయానికి పూర్తి చేసి షట్టర్లు మూసిన సమయంలో నీరు వృథాగా పారకుండా చూస్తాం.
– కేశవరావు, ఈఈ, భీమా ఫేజ్–2


