గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి
జామి: మండలంలోని కొత్త భీమసింగి గ్రామానికి చెందిన యువకుడు గుర్తు తెలియని వాహనం ఢీకొని బుధవారం మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబసభ్యులు, స్ధానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొత్త భీమసింగి గ్రామానికి చెందిన పాండ్రంకి వెంకటేష్(35) మంగళవారం సాయంత్రం అత్తవారికి సంబంధించి విజయనగరంలోని జూట్మిల్లు వద్ద గల పాస్ట్ఫుడ్ సెంటర్కు వెళ్లాడు. అక్కడ వారికి సహాయం చేసి తిరిగి మంగళవారం రాత్రి స్వగ్రామానికి 11.45గంటలకు బైక్పై వస్తున్న సమయంలో చిన్నాపురం జంక్షన్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో స్పృహ కోల్పోయి పక్కకు పడిపోయాడు. ఈ విషయాన్ని స్ధానికులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. దీంతో సిబ్బంది వచ్చి మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పద్మనాభం మండలం పోలీసులు కేసు నమోదుచేశారు. భీమిలి సీహెచ్సీలో పోస్ట్మార్టం అనంతరం మృతదేహన్ని స్వగామం కొత్త భీమసింగికి తరలించారు.
పావుగంటముందే భార్యకు పోన్
మృత్యువాత పడడానికి పావుగంట ముందే వెంకటేష్ భార్యకు ఫోన్ చేశాడు. ఇంతలోనే భర్త మృతిచెందాడన్న విషయం తెలియడంతో భార్యతో పాటు కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడు వెంకటేష్కు భార్య సూర్యకళ ఇద్దరు కుమార్తెలు గాయత్రి(11),యోగితాశ్రీ(10), తల్లిదండ్రులు, తమ్ముడు ఉన్నారు. తండ్రి నాగరాజు ఇటీవల పక్షవాతం వచ్చి బాధపడుతున్నాడు.
బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
వేపాడ: మండలంలోని కుమ్మపల్లి జంక్షన్ వద్ద బుధవారం బైక్ అదుపు తప్పడంతో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఇందుకు సంబంధించి వల్లంపూడి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దేవరాపల్లి మండలం కొత్తూరు ముత్యాలమ్మపాలెం గ్రామానికి చెందిన చౌడువాడ దేముడునాయుడు(25) వ్యవసాయం చేసుకుంటూ తల్లిదండ్రులతో గ్రామంలో నివాసముంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం అదే గ్రామానికిచెందిన స్నేహితుడు గంధం మహేష్తో కలిసి బైక్పై వెళ్లాడు. బిర్యానీ లేకపోవడంతో తిరిగి తమ గ్రామానికి వెళ్తుండగా కుమ్మపల్లి జంక్షన్ వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించే ప్రయత్నంలో బైక్ అదుపు చేయలేక నడుపుతున్న గంధం మహేష్ సడన్ బ్రేక్ వేయడంతో బైక్ వెనుక కూర్చున్న దేముడునాయుడు బైక్పై నుంచి తుళ్లి పడి రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయమై అక్కడిక్కడే మృతిచెందాడు. దీనిపై మృతుడి తండ్రి చౌడువాడ సముద్రంనాయుడు వల్లంపూడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్సై సుదర్శన్ కేసు నమోదుచేసి పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి


