నగర శివార్లలో డ్రోన్లతో నిఘా | - | Sakshi
Sakshi News home page

నగర శివార్లలో డ్రోన్లతో నిఘా

Jul 11 2025 5:39 AM | Updated on Jul 11 2025 5:39 AM

నగర శివార్లలో డ్రోన్లతో నిఘా

నగర శివార్లలో డ్రోన్లతో నిఘా

విజయనగరం క్రైమ్‌: నేరాల నియంత్రణలో భాగంగా నగర శివారుల్లో డ్రోన్లతో నిఘా పెడుతున్నారు. ఇటీవల జరిగిన నేర సమీక్షలో ఎస్పీ ఆదేశాల మేరకు విజయనగరం రూరల్‌ పోలీసులు ఈ చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ మేరకు సున్నితమైన, మారుమూల ప్రదేశాలైన జమ్ము, నారాయణపురం, పడాలపేట, వైఎస్సార్‌ నగర్‌, ఫోర్ట్‌ సిటీ స్కూల్‌ వెనక ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘాకు చర్యలు తీసుకున్నామని రూరల్‌ సీఐ లక్ష్మణరావు తెలిపారు. ప్రతిరోజూ ఈ డ్రోన్ల ద్వారా నిఘా ఉంటుందని, అనుమానాస్పద వ్యక్తుల సంచారం, అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని, తద్వారా నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement