
ఉచిత సీట్లు ఇవ్వకపోతే ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు
విజయనగరం అర్బన్: ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతిలో పేదలకు ఉచితంగా కేటాయించిన సీట్లను ఇచ్చే చట్టాన్ని అమలు చేయకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ స్పష్టం చేశారు. విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 25 శాతం సీట్లను ఉచితంగా పేదలకు కేటాయించాల్సి ఉండగా స్థానికంగా ఉన్న ఫోర్ట్సిటీ, సన్, బీసెంట్, చాణిక్య స్కూల్స్లో సీట్లు కేటాయించడం లేదని పలువురు తల్లిదండ్రులు కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత నాలుగు పాఠశాలల ద్వారా 240 సీట్లు కేటాయించాల్సి ఉందని వాటిని వెంటనే కేటాయించమని ఆదేశాలు జారీ చేయాలని డీఈఓ యూ.మాణిక్యంనాయుడికి సూచించారు.
పీజీఆర్ఎస్కు 190 వినతులు
ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే వినతులను లాగిన్లో అధికారులు ఎప్పటికప్పుడు చూడాలని ఇంకనూ చూడవలసిన కాలమ్లో ఎప్పుడు చూసినా సున్నా కనపడాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ ఆదేశించారు. సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ ప్రజల నుంచి 190 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రోజు లాగిన్ అయి అధికారులు వినతులను చూడాలని అలాగే రీ ఓపెన్ కేసులు కూడా పూర్తిగా విచారణ జరిపి ముగించాలని తెలిపారు. గడువులోపల వినతులకు సమాధానాలు పంపాలని ఆదేశించారు.
ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 46 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఏఎస్పీ సౌమ్యలత 46 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదు అంశాలను పరిశీలించి, పూర్వా పరాలపై విచారణ చేసి, వాస్తవమైతే చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని సంబంధిత పోలీసు అధికారులను అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ఆదేశించారు.
కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్
పీజీఆర్ఎస్కు 190 వినతులు

ఉచిత సీట్లు ఇవ్వకపోతే ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు