ప్రస్తుతం మావిగన్ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర రాతలకు పూనుకున్నారు. జర్నలిజం విలువలను పూర్తిగా కాలరాసిన రాధాకృష్ణ ప్రవర్తన పిచ్చి పరాకాష్టకు చేరుకుంది. కమిషన్ల కోసం కక్కుర్తి పడుతూ వ్యవస్థలను దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్యానికి క్షేమం కాదు. మీడియా వేదికల ద్వారా మహిళలను అవమానించడం సమాజానికి తప్పుడు సంకేతాలను ఇస్తుంది. రాధాకృష్ణ తన వ్యాఖ్యలపై వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
– వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా
అధ్యక్షుడు కె.కె.రాజు


