జోడుగుళ్లుపాలెంలో పదేళ్ల క్రితమే ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ముందు, కావాలనే బీజేపీ నాయకులు పార్టీ జెండాను ప్రతిష్టించడం కేవలం గొడవలు సృష్టించడానికే. వేరే చోట స్థలం ఉన్నప్పటికీ ఇక్కడే జెండా పాతి వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు స్థానిక ఆటో డ్రైవర్లను కూడా ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. గొడవలతో ఏదో సాధిస్తామనుకోవడం బీజేపీ నేతల భ్రమ. తమ మొండి నిర్ణయాన్ని మార్చుకోకపోతే, ఆటో డ్రైవర్లను కలుపుకొని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతాం. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను అడ్డుకుంటాం.
–మొల్లి అప్పారావు, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, తూర్పు నియోజవర్గం


