మరికొంతకాలం ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

మరికొంతకాలం ప్రత్యేక రైళ్లు

Mar 30 2026 7:20 AM | Updated on Mar 30 2026 7:20 AM

తాటిచెట్లపాలెం: వేసవి సీజన్‌ ప్రారంభమైన వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ కె.పవన్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

● ప్రతి మంగళవారం బయలుదేరే విశాఖపట్నం–షాలిమర్‌(08508) స్పెషల్‌ రైలును జూన్‌ 30 వరకు, షాలిమర్‌–విశాఖపట్నం (08507) స్పెషల్‌ను జూలై 1వ తేదీ వరకు పొడిగించారు.

● దువ్వాడ మీదుగా ప్రయాణించే సంబల్‌పూర్‌–ఈరోడ్‌(08311) వీక్లీ స్పెషల్‌ను మే 27వ తేదీ వరకు, ఈరోడ్‌–సంబల్‌పూర్‌ (08312) వీక్లీ స్పెషల్‌ను మే 29వ తేదీ వరకు పొడిగించారు.

● దువ్వాడ మీదుగా ప్రయాణించే భువనేశ్వర్‌–యశ్వంత్‌పూర్‌(02811) వీక్లీ ఏసీ స్పెషల్‌ను జూన్‌ 27వ తేదీ వరకు, యశ్వంత్‌పూర్‌–భువనేశ్వర్‌ (02812) వీక్లీ ఏసీ స్పెషల్‌ను జూన్‌ 29వ తేదీ వరకు పొడిగించారు. ● విజయనగరం మీదుగా ప్రయాణించే యశ్వంత్‌పూర్‌–కతిహార్‌(06571) వీక్లీ ఏసీ స్పెషల్‌ను జూలై 14వ తేదీ వరకు, కతిహార్‌–యశ్వంత్‌పూర్‌ (06572) వీక్లీ ఏసీ స్పెషల్‌ను జూలై 17వ తేదీ వరకు పొడిగించారు.

● దువ్వాడ మీదుగా ప్రయాణించే ఎస్‌ఎంవీ బెంగళూరు–మాల్డా టౌన్‌(06565) స్పెషల్‌ రైలును జూలై 12వతేదీ వరకు,మాల్డా టౌన్‌– ఎస్‌ఎంవీ బెంగళూరు(06566) స్పెషల్‌ను జూలై 15వ తేదీ వరకు పొడిగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement