ఎంపీడీవోలుగా 9 మందికి పదోన్నతులు | - | Sakshi
Sakshi News home page

ఎంపీడీవోలుగా 9 మందికి పదోన్నతులు

Sep 17 2025 7:13 AM | Updated on Sep 17 2025 7:13 AM

ఎంపీడీవోలుగా 9 మందికి పదోన్నతులు

ఎంపీడీవోలుగా 9 మందికి పదోన్నతులు

మహారాణిపేట: ఉమ్మడి విశాఖ జిల్లాలో పనిచేస్తున్న పరిపాలనాధికారులు(ఏవో), విస్తరణాధికారుల(ఈవోఆర్డీ)కు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులుగా(ఎంపీడీవో) పదోన్నతులు లభించాయి. మొత్తం 9 మందికి పదోన్నతులతో పాటు పోస్టింగ్‌లు ఇస్తూ జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం జెడ్పీ చైర్‌పర్సన్‌ జె. సుభద్ర వారికి నియామక పత్రాలు అందజేశారు. జి.కె.వీధి ఎంపీడీవోగా బి.హెచ్‌.వి.రమణబాబు, బుచ్చయ్య పేట ఎంపీడీవోగా కె.ఎన్‌.సి.నారాయణరావు, రావికమతం ఎంపీడీవోగా ఒ.మహేష్‌, కశింకోట ఎంపీడీవోగా సి.హెచ్‌.చంద్రశేఖరరావు, కోటవురట్ల ఎంపీడీవోగా చంద్రశేఖరరావు, నాతవరం ఎంపీడీవోగా ఎం.ఎస్‌.శ్రీనివాసులు, ఎస్‌.రాయవరం ఎంపీడీవోగా మీనా కుమారి, పాయకరావుపేట ఎంపీడీవోగా విజయలక్ష్మి, ముంచంగిపుట్టు ఎంపీడీవోగా కె.ధర్మారావు నియమితులయ్యారు. డిప్యూటీ సీఈవో కె.రాజ్‌కుమార్‌, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సత్తిబాబు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement