మరికొంతకాలంప్రత్యేక రైళ్ల పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

మరికొంతకాలంప్రత్యేక రైళ్ల పొడిగింపు

May 24 2025 1:01 AM | Updated on May 24 2025 1:01 AM

మరికొంతకాలంప్రత్యేక రైళ్ల పొడిగింపు

మరికొంతకాలంప్రత్యేక రైళ్ల పొడిగింపు

తాటిచెట్లపాలెం: విశాఖపట్నం–ఎస్‌ఎంవీ బెంగళూరు, విశాఖపట్నం–షాలిమర్‌ మధ్య నడుస్తున్న స్పెషల్‌ రైళ్లను మరికొంత కాలం పొడిగించినట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. విశాఖపట్నం–ఎస్‌ఎంవీ బెంగళూరు(08581) వీక్లీ స్పెషల్‌ ప్రతి ఆదివారం విశాఖలో మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.45 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైలు జూన్‌ 29 వరకు పొడిగించారు. ఎస్‌ఎంవీ బెంగళూరు–విశాఖపట్నం (08581) వీక్లీ స్పెషల్‌ ప్రతి సోమవారం మధ్యాహ్నం బెంగళూరులో 3.50 గంటలకు బయలుదేరి.. మరుసటిరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైలు జూన్‌ 30 వరకు పొడిగించారు.

● విశాఖపట్నం–షాలిమర్‌(08508) స్పెషల్‌ ప్రతి మంగళవారం విశాఖపట్నంలో ఉదయం 11.20 గంటలకు బయలుదేరి మరుసటిరోజు తెల్లవారుజాము 3 గంటలకు షాలిమర్‌ చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైలు జూన్‌ 24 వరకు పొడిగించారు. షాలిమర్‌–విశాఖపట్నం (08507) స్పెషల్‌ ప్రతి బుధవారం షాలిమర్‌లో తెల్లవారు 5 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 8.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ జూన్‌ 25 వరకు పొడిగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement