మొండిగౌరెల్లిలోని 19, 68, 127 సర్వే నంబర్లలోని అసైన్డ్ భూమిని పారిశ్రామిక పార్క్ల కోసం సేకరిస్తున్నాం. మొదట 127లోని రైతులకు పరిహారం ఇచ్చేందుకు అవార్డు ప్రకటన జారీ చేస్తాం. ఆ తర్వాత 68, మూడో విడతలో 19లోని రైతులకు పరిహారం ఇవ్వడానికి కృషి చేస్తున్నాం. విడతల వారీగా అవార్డులు జారీ చేసి, పరిహారం అందించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయి. కబ్జాలో ఉన్న రైతులకు పరిహారం ఇచ్చే అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది.
– శ్రీనివాస్రెడ్డి, ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం


