కేశంపేట: రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శంషాబాద్లోని లిమ్స్ న్యూరో కార్డియో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వారు కేశంపేటలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో కేశంపేట గ్రామస్తులతో పాటు సమీప గ్రామాల నుంచి సుమారు 300 మంది రోగులు పాల్గొని వైద్యపరీక్షలు చేయించుకొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు అవసరమైన రోగులకు ఉచితంగా మందులు అందించారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ హైదరాబాద్ చైర్మన్ భీమ్రెడ్డి, శ్రీశైలం, స్వచ్ఛంద సేవకులు ప్రవీణ, జ్యోతి, వేంకటేశ్వర్రావు, రామోదర్రెడ్డి, భీమయ్య, నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


