గతేడాదితో పోలిస్తే రెండు స్థానాలు మెరుగుపర్చుకోగలిగాం. ఫలితాల పరంగా చూస్తే బాగా మెరుగయ్యాం. తాము ఆశించిన ఫలితాలు వచ్చినప్పటికీ స్థానం పరంగా ఇంకా కాస్తా మెరుగవ్వాల్సింది. ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు ఉపాధ్యాయులు ఎంతో కష్టపడ్డారు. ఈ ఫలితాలను బేరీజు వేసుకొని సప్లిమెంటరీలో వందశాతం ఫలితాలకోసం కార్యాచరణను రూపొందిస్తాం. ఏయే సబ్జెక్టులల్లో, ఏయే పాఠశాలల్లో తక్కువ ఫలితాలు వచ్చాయో సమీక్షించుకుని సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే వారికోసం ప్రత్యేకంగా క్లాసులు నిర్వహించాలని యోచిస్తున్నాం. ఉత్తీర్ణులకు అభినందనలు.
– జి.రేణుకాదేవి, జిల్లా విద్యాధికారి


