యాచారం: హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ మానవత్వం చాటుకున్నారు. కందుకూరు మండలం మాలగూడూరు గ్రామానికి చెందిన బండి కరుణాకర్ ఆదివారం వ్యక్తిగత పనిమీద మీరాఖాన్పేటకు బైక్పై వచ్చి తిరుగుపయనమయ్యాడు. మార్గ మధ్యలో బైక్ అదుపు తప్పి కిందపడిపోయాడు. సమాచారం అందుకున్న సీఐ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ కరుణాకర్ను వెంటనే తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు. 108కు సమాచారం అందించగా మార్గమధ్యలో 108 వాహనం రావడంతో అందులో ఎక్కించి నగరంలోని ఓ ప్రవేట్ ఆస్పత్రికి తరలించారు.


