ఎమ్మెల్యే మనోహర్రెడ్డి
తాండూరు: మార్వాడీ సమాజం అభివృద్ధికి అన్ని విధాలా చేయూతనందిస్తానని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణ శివారులో మార్వాడీలకు కేటాయించిన స్థలంలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం మార్వాడీలకు ఎకరా భూమిని కేటాయించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ, కాంగ్రెస్ నేత శ్రీనివాస్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింహులు, వ్యాపారులు సురేష్ పర్తాని, ఓం ప్రకాష్ సోమాని, మన్మోహన్ సర్డా, దినేష్ పర్తాని తదితరులు పాల్గొన్నారు.


