రేపు రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ సమావేశం | - | Sakshi
Sakshi News home page

రేపు రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ సమావేశం

Mar 22 2026 1:26 AM | Updated on Mar 22 2026 1:26 AM

రేపు రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ సమావేశం అనంతగిరి: తెలంగాణ స్టేట్‌ గవర్నమెంట్‌ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యనిర్వాహక సమావేశం సోమవారం వికారాబాద్‌లో ఉంటుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మాణిక్‌ ప్రభు ఒక ప్రకటనలో తెలిపారు. బస్టాండ్‌ పక్కన గల శ్రీ సత్యసాయి జ్ఞాన కేంద్రంలో ఈ సమావేశం ఉంటుందని చెప్పారు. కావున ప్రతినిధులు హాజరు కావాలని ఆయన తెలిపారు. విద్యారంగానికి మొండి చేయి తాండూరు టౌన్‌: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి ప్రభుత్వం మొండి చేయి చూపిందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ గౌడ్‌ ఽశనివారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో విద్యా రంగానికి తొలి బడ్జెట్‌లోనే 15 శాతం నిధుల కేటాయిస్తానని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం 8.2 శాతం మాత్రమే కేటాయించిందన్నారు. మండలానికో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ నిర్మిస్తామని చెప్పడం ప్రచార ఆర్భాటమేనని తేలిందన్నారు. ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌, తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటు పేరుతో ప్రభుత్వ పాఠశాలలను బలహీన పరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా రూ.4,343 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. నిరుద్యోగం పెరుగుతున్న వేళ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో ఉద్యోగాలు భర్తీ చేయకుండా తప్పించుకోవడం సమంజసం కాదన్నారు. విద్యారంగంపై కేటాయించిన బడ్జెట్‌ను సవరించి 30 శాతం నిధులను కేటాయించాలని ఎస్‌ఎఫ్‌ఐ తరఫున డిమాండ్‌ చేస్తున్నామన్నారు. గర్భిణులకు మెరుగైన సేవలందాలి

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు

రాజ్‌కుమార్‌ గౌడ్‌

డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఆనంద్‌

తాండూరు: మాతా శిశు ఆస్పత్రిలో వైద్య సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఆనంద్‌ ఆదేశించారు. శనివారం పట్టణ శివారులో ఉన్న మాతా శిశు ఆస్పత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వైద్య సేవలపై సూపరింటెండెంట్‌ డాక్టర్‌.వినయ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కొడంగల్‌ మండలం లక్ష్మిపల్లి గ్రామానికి చెందిన శిరీష కాన్పు కోసం కుటుంబ సభ్యులు మాతా శిశు ఆస్పత్రికి 108 వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యలో ఈ నెల 19వ తేదీన ప్రసవించిన ఘటనపై డీసీహెచ్‌ఎస్‌ ఆరా తీశారు. శిరీషతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది ఎలాంటి వివాదాలు తలెత్తకుండా రోస్టర్‌ ప్రకారం విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి ‘రైతు భరోసా’

ఎకరాకు రూ.ఆరు వేల చొప్పున జమ

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా నగదు ఆదివారం నుంచి రైతుల ఖాతా ల్లో జమ కానుంది. సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. తొలి దశలో ఎకరంలోపు రైతుల ఖాతాల్లో నగదు జమకానుంది. ఆ తర్వాత రెండు, మూడు దశల్లో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నారు. నిజానికి యాసంగికి ముందే ఈ సహాయం అందజేయాల్సి ఉంది. పలు సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. నేటి నుంచి రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేయ నుంది. రంగారెడ్డి జిల్లాలో 2,83,709 లక్షల మంది రైతులు ఉండగా, వీరు 6,35,502 ఎకరాలకుగాను సాయం పొందనున్నారు. ఈ జిల్లా రైతుల ఖాతాల్లో రూ.318 కోట్లకుపైగా జమకానుండగా, వికారాబాద్‌ జిల్లాలో 3,27,561 మంది రైతులు ఉండగా, వీరు 6,45,166 ఎకరాలకు రైతుభరోసా పొందనున్నారు. కొత్తగా మరో 15,784 మంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరి ఖాతాల్లో రూ.387 కోట్లకుపైగా జమ కానుంది. ఈ కార్యక్రమాన్ని రైతులు వీక్షించేందుకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఆయా రైతు వేదికల్లో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్‌లు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement