పాఠశాల భవన నిర్మాణం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

పాఠశాల భవన నిర్మాణం ప్రారంభం

Nov 21 2025 11:42 AM | Updated on Nov 21 2025 11:42 AM

పాఠశాల భవన నిర్మాణం ప్రారంభం

పాఠశాల భవన నిర్మాణం ప్రారంభం

దుద్యాల్‌: అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనానికి కడా ప్రత్యేక నిధులు మంజూరయ్యాయని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేరుగు వెంకటయ్య, కొడంగల్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఆకారం వేణుగోపాల్‌ తెలిపారు. గురువారం పాఠశాల భవనానికి పైకప్పు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతుల కోసం పన్నెండేళ్ల క్రితం పది గదులు మంజూరు చేశారు. అప్పట్లో అసంపూర్తిగా నిర్మించి కాంట్రాక్టర్‌ వదిలేసి పోయాడు. ఈ సమస్యను ఇటీవల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కడా ప్రత్యేక నిధుల నుంచి రూ.75 లక్షలు మంజూరు చేశారు. దీంతో నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో నాయకులు కృష్ణ, శ్రీశైలంగౌడ్‌, సత్యనారాయణ, ఖాజా, హజీ, హన్మంతునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement