యాసంగిపై ఆశలు! | - | Sakshi
Sakshi News home page

యాసంగిపై ఆశలు!

Oct 18 2025 9:57 AM | Updated on Oct 18 2025 9:57 AM

యాసంగిపై ఆశలు!

యాసంగిపై ఆశలు!

రబీలో సాగు విస్తీర్ణం భారీగా పెరగనుంది. గడిచిన కాలంలో కురిసిన భారీ వర్షాలకు చెరువులు, జలాశయాలు నిండుకుండను తలపిస్తుండగా.. భూగర్భ జలాలు పెరిగాయి. ౖపైపెకి ఉబికి వస్తున్నాయి. దీంతో యాసంగి ఈ సారి ఆశాజనకంగా ఉండనుంది.

తాండూరు: వానాకాలం(ఖరీఫ్‌)లో అతివృష్టికి పంటపొలాలు దెబ్బతిన్నాయి. చేతికందొచ్చిన పంట నేలపాలై నష్టాలను మూటగట్టుకున్న రైతన్నలు.. ఆ లోటును ప్రస్తుత యాసంగి(రబీ)లో పూడ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆశతో సాగుకు సమాయత్తం అవుతున్నారు. వ్యవసాయ శాఖ ప్రణాళికను మించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రధాన పంటగా వరి

రబీ పంటల ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.56 లక్షల ఎకరాల్లో సాగు అంచనా వేశారు. అయితే అందులో వరి 1.01 లక్షల ఎకరాలు, కూరగాయ పంటలు మరో 7,121 వేల ఎకరాల్లో ఉండనుంది. 70 శాతం ప్రధాన పంటగా వరి సాగు కానుంది. పప్పు, నూనే గింజలు శనగలు 4,216 ఎకరాలు, వేరు శనగ 15,110 ఎకరాలు, మొక్కజొన్న, జొన్న, కుసుమ తదితర పంటలను మిగిలిన ఎకరాల్లో సాగుకు సిద్ధం చేశారు.

ఉద్యాన పంటలకు ఊతం

ప్రస్తుత యాసంగిలో 7,121 ఎకరాల్లో కూరగాయలు సాగవనున్నట్లు వ్యవసాయ శాఖఅంచనా వేసింది. ఉల్లి, టమాటా, మిరప, బీర, బెండ, క్యాబేజీ తదితర వాటిని పండిస్తున్నారు. ఉద్యాన రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రధానంగా వరి, మొక్కజొన్న, జొన్న, చెరకు, పొద్దుతిరుగుడు, వేరుశనగ పంటలను 1.48 లక్షల ఎకరాలు, కూరగాయలు 7,121 ఎకరాల్లో సాగవనుంది. ఇతర పంటలతో కలిపి మొత్తంగా జిల్లాలో 1,56,925 ఎకరాల్లో యాసంగి సాగుకు ప్రఽణాళికను సిద్ధం చేశారు.

పంటల వారీగా రబీ సాగు..

పంట ఎకరాలు

వరి 1,01,397

శనగ 4,217

వేరుశనగ 15,110

జొన్న 12,745

మొక్కజొన్న 11,271

చెరకు 700

పొద్దుతిరుగుడు 2,513

కంది 1,376

ఇతర పంటలు 475

కూరగాయ పంటలు 7,121

మొత్తం 1,56,925

నిండుకుండల్లా జలాశయాలు

పెరిగిన భూగర్భ జలాలు

సాగుకు సన్నద్ధమవుతున్న రైతన్న

జిల్లాలో 1,56,925ఎకరాల్లో పంటల అంచనా

ఉద్యాన పంటలు 7,121 వేలు,వరి 1.01 లక్షల ఎకరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement