
మత్తుతో జీవితం చిత్తు!
తాండూరు టౌన్: మాదక ద్రవ్యాల వినియోగంతో జీవితాలు చిత్తవుతాయని తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు కళాశాల విద్యార్థులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ డ్రగ్స్ వినియోగం, విక్రయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఇందిరాచౌక్లో ఏర్పాటు చేసిన వేదికపై డీఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు బానిసలైన యువత నేరాలకు పాల్పడతున్నారన్నారు. యువత సన్మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ సంతోశ్ కుమార్, ఐఎంఏ తాండూరు అధ్యక్షుడు డాక్టర్ జయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్తో కలిగే అనర్థాలపై..
బొంరాస్పేట: ప్రతిఒక్కరూ వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ మోహనచంద్ర, ఎంఈఓ హరిలాల్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ప్రతీ విద్యార్థి ఉన్నత ఆశయాలను ఎంచుకొని చదువుకోవాలన్నారు. ఉత్తమ విద్యార్థిగా రాణించి భవిష్యత్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. మత్తు అలవాటైతే విలువైన జీవితం చిత్తవుతుందని హెచ్చరించారు.
సెల్ఫోన్లకు దూరంగా..
ప్రతిఒక్కరూ సెల్ఫోన్లకు దూరంగా ఉంటే మేలు జరుగుతుందన్నారు. ఏదైన సందేహాలు, మంచి విషయాలకు, విద్యాభ్యాసం వంటివి మెరుగుపరుచుకోవడానికి తప్ప మరే సందర్భంలోనూ వాడొద్దన్నారు. గేమ్లు, బెట్టింగులు, ఫోన్లకు వచ్చే లింకులకు ఎట్టి పరిస్థితుల్లోను ఓటీపీ వంటివి చెప్పొదన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ దినేశ్, ఏఎస్ఐ ఆనంద్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దు
మోమిన్పేట: విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దని సీఐ వెంకట్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు మాదక ద్రవ్యాలను నివారించేందుకు అవగాహన కల్పించి, ప్రధాన వీదుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మత్తుతో భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఉన్నత పాఠశాల ప్రదానోపాధ్యాయుడు శ్రీనివాస్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్ రహిత సమాజానికి కృషి
కుల్కచర్ల: డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కేజీబీవీ ప్రత్యేకాధికారి దేవి, చౌడాపూర్ కేజీబీవీ ప్రత్యేకాధికారి జ్యోతి పేర్కొన్నారు. కుల్కచర్ల మండల కేంద్రంలోని కస్తుర్బాగాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో డ్రగ్స్ నివారణకు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... మత్తుపదార్థాలకు అలవాటు పడితే జీవితాలు నాశనం అవుతాయన్నారు.
దుద్యాల్లో..
దుద్యాల్: మాదక ద్రవ్యాలను నిర్మూలించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని మండల విద్యాధికారి విజయ రామారావు పేర్కొన్నారు. ఎంపీడీవో కార్యాలయం ఎదుట అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మాదకద్రవ్యాలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకుసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సత్యనారాయణ, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
బంట్వారం: మాదకద్రవ్యాలను నిర్మూలించాలని కోట్పల్లి, బంట్వారం ఎస్ఐలు శైలజ, విమల పేర్కొన్నారు. కోట్పల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ విద్యార్థులతో చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డ్రగ్స్, గంజాయి, అమ్మకం, కొనుగోలు చేసినట్లు తెలిస్తే సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.
వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి
తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి
డ్రగ్స్పై అవగాహన
విద్యార్థుల ర్యాలీ, మానవహారం
అలవాటు చేసుకోవద్దు
కొడంగల్: ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ, డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి వినాయక చౌరస్తా నుంచి బసిరెడ్డి ఫంక్షన్హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు చేసుకోవదన్నారు. ఈ కార్యక్రమంలో కొడంగల్, దౌల్తాబాద్, దుద్యాల్ ఎస్ఐలు సత్యనారాయణ, రవి గౌడ్, యాదగిరి, కళాశాలల ప్రిన్సిపాల్లు, పాల్గొన్నారు.

మత్తుతో జీవితం చిత్తు!

మత్తుతో జీవితం చిత్తు!